Monday, August 13, 2007

బాపుగారి "శ్రీభాగవతం"

రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రంబై, శిరోరత్నమై,శ్రవణాలంకతియై,గళాభరణమై, సువర్ణ కయూరమై, ఛవిమత్కంకణమై, కటిస్థలి నుదంచత్ఘంటయై, నూపుర ప్రవరంబై, పాదపీఠమై, వటుడు దా బ్రహ్మాండము నిండుచోన్

వామనుడు మూడో అడుగు కోసం పాదం మోపడానికై విశ్వరూపం దాల్చుతున్నప్పుడు పోతన చేసిన వర్ణన ఇది. మొదట రవి వమనునికి గొడుగు లాగ శిరస్సు దగ్గర వుంది. తరువాత కిరీటం అయింది. చెవికి అలంకరణగా చెవిపోగులా కనిపించింది. గొంతుదగ్గర హారం అయింది. నదుముకి వడ్డణం, తదుపరి చేతికి కంకణం చివరికి పాద పీఠమైంది.
( ఇది నా సొంత తాత్పర్యం. తప్పులుంటే మన్నించగలరు.)
బాపు గారి శ్రీభాగవతం లో పై వర్ణనను కల్లకు కట్టినట్లుగా చూపించారు. పై తాత్పర్యాన్ని నేను కేవలం వామనావతారం ఎపిసోద్ చూసి వ్రాసానంటే అది ఎంత బాగా చూపించారొ అర్థం చేసుకోవచ్చు.

1 comment:

bhavani said...

bapu gari sitakalyanamni vamanavataram kosam 10 sarlu chusanu